దక్షిణాఫ్రికా టార్గెట్@ 290

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా అదరగొట్టింది. భారత బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌(109), విరాట్‌ కోహ్లీ(75:) చెలరేగగా..ఆఖర్లో మహేంద్రసింగ్‌ ధోనీ(42 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లో 7 వికెట్ల నష్టానికి భారత్‌ 289 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద రోహిత్‌శర్మ రూపంలో టీమిండియా వికెట్‌ను కోల్పోయింది. అయితే వికెట్‌ తీశామన్న ఆనందం దక్షిణాఫ్రికా జట్టులో ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు సఫారి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ధావన్‌, విరాట్‌ మరోసారి 150 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది.