చైనాలో కశ్యప్ సంచలనం !

Parupalli-Kashyapచైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ సంచలనం సృష్టించాడు. గ్వాంగ్జౌ వేదికగా నేడు జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో పదమూడో సీడ్ కశ్యప్ 21-13, 21-16తో హాంకాంగ్ కు చెందిన ఆరో సీడ్ యూన్ హ్యూ పై సంచలన విజయం నమోదు సాధించాడు. ఈ విజయంతో కశ్యప్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు.