టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..

భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త..ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ సీజన్ నుండి శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. ఈనెల 9న‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. దీంతో శిఖర్ వేలుకు బలమైన గాయం తగలడం తో ..ఇప్పట్లో గాయం నుంచి కోలుకునే సూచనలు కన్పించకపోవడంతో అతని స్థానంలో ఇంకో ఆటగాడిని తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో శిఖర్ స్థానంలో రిషబ్ పంత్‌ను అధికారికంగా తుదిజట్టుకు ఎంపిక చేశారు. పంత్ ఎంపిక‌ను బీసీసీఐ..ఐసీసీకి తెలిపింది. నిజంగా ధావన్ అభిమానులకు చేదు వార్తే అని చెప్పాలి. ఐసీసీ మెగా టోర్నీల్లో ధావన్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. దీంతో అతడి సేవలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని, 10-12 రోజుల తర్వాత అతడు గాయం నుంచి కోలుకుంటున్న విధానాన్ని సమీక్షిస్తామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు.