Site icon TeluguMirchi.com

విమానాల హైజాక్ జరగొచ్చు !

Securityదేశంలోని పలు నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. ఐబీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి ఉన్నాయి. ఈ నగరాలలో ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసే అవకాశముందని ఐబీ తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి నగరాల్లోని ఎయిర్ పోర్ట్ లకు ప్రమాదం పొంచి వుందని తెలిపింది.

Exit mobile version