బీహార్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. మొదటి పేలుడు ఉదయం 5:25 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. ఆ తరువాత వరుసగా నాలుగు పేలుళ్లు సంభవించాయి .స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు సన్యాసులు గాయపడ్డారు. ఆలయం వెలుపల పేలకుండా ఉన్న మరో బాంబును భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేశారు. సీఆర్పీపీఫ్, పోలీసులు ఘటనాస్థలిని చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.