శ్రీవారి సేవలో..

jc-sadasivanఇటీవలే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సదాశివం ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ హైక్టోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ సేన్ గుప్తా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. టి.టి.డి ఎంజీ గోపాల్, జె.ఈవొ. శ్రీనివాస రాజు వీరికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.