దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో కోహ్లీసేన తడబడి నిలబడింది. 300పరుగులు ఈజీగా చెస్తుందనుకున్న జట్టు 274 పరుగులతో సరిపెట్టుకుంది, ఓపెనర్ రోహిత్ శర్మ (115 )తో పాటు ధావన్, కోహ్లీ, శ్రేయస్ రాణించడంతో 274 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం లభించింది. తొలి వికెట్ను 48 పరుగుల వద్ద చేజార్చుకుంది. దూకుడుగా ఆడుతూ వరుస బౌండరీలు బాదుతున్న శిఖర్ ధావన్ (34; 23 )ను రబాడ వేసిన బంతికి ఔట్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో ఇన్నింగ్ ను చక్కదిద్దాడు ఓపెనర్ రోహిత్ శర్మ. కెరీర్లో 17వ శతకం సాధించాడు. ఈ దశలో భారత ఇన్నింగ్ మూడు వందల పరుగుగులకు ఈజీగా చేరుతుందని భావించారు. కానీ రన్ ఔట్స్ కొంపముంచాయి. చివర్లో సఫారీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 274 పరుగుగులు మాత్రమే చేయగలిగింది భారత్.