తాగి రచ్చ రచ్చ చేశారు

drunkin ladyతాగిన మైకంలో నగరానికి చెందిన ఓ యువతి పాటు ఆమె స్నేహితులు కొందరు శంషాబాద్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించించారు. ఎయిర్ పోర్ట్ గేమ్స్ జోన్స్ సిబ్బంది తో గొడవకు దిగి నానా రచ్చ చేశారు. తాగిన మైకంలో చేతికందిన ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది విమానాశ్రయంలోని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు విమానాశ్రయానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబసభ్యులు ఆగమేఘాలపై విమానాశ్రయంలోని పోలీసు స్టేషన్ కు తరలివచ్చారు. తాగి హంగామా చేసిన యువతికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, అనంతరం ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోడ్రన్ కల్చర్ అనే ముసుగులో వీకెండ్స్ అని పేరు పెట్టి జరుగుతున్న ఇలాంటి చేష్టలు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి.