శ్రీవారిని దర్శించుకున్న రోశయ్య !

rosayyaతిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన రోశయ్యకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగానాయకుల మండపంలో ఆలయ పండితులు ఆశీర్వదించి శేషవస్త్రంతో సత్కరించారు.