యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం!

road accident in upయూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎటా జిల్లాలో పిలువా ప్రాంతంలో గతరాత్రి బస్సు అదుపు తప్పి హజారా కాల్వలో పడిన ఘటనలో 19మంది మృతి చెందగా, 23మంది గాయలపాలైయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పిస్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఫరూఖాబాద్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.