Site icon TeluguMirchi.com

లారీ డ్రైవర్ ఘాతుకం..ఆరుగురు మృతి

lorryaccidentప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ డ్రైవర్ మధ్యం మత్తులో వాహనం నడిపి ఆరుగురు మృతికి కారణమైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నాగులప్పులపాడు మండలం చదలవాడ, మద్దిరాలపాడు వద్ద మధ్యం మత్తులో నడుపుతున్న వ్యక్తి వాహనం ఎదురుగా వస్తున్న ఆటో, బైక్లను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Exit mobile version