భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు

PUTIN-manmohan-singhరష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో పుతిన్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఈ ఉదయం 11.30కు పుతిన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం రాష్ర్టపతి భవన్ లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్ సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ తో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30కు రష్కాకు తిరిగి వెళ్లనున్నారు. పుతిన్ 2010లో ఆ దేశ ప్రధానిగా భారత్ లో పర్యటించారు.