Site icon TeluguMirchi.com

ఐపీఎల్ కొత్త చైర్మన్ బిస్వాల్

team manager Ranjib Biswalఐపీఎల్ కు కొత్త ఛైర్మన్ గా రంజిబ్ బిశ్వాల్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో బిశ్వాల్ పేరును ఖరారు చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బసంత్ కుమార్ బిశ్వాల్ కుమారుడైన రంజిబ్… ప్రస్తుతం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. గతంలో ఆయన అండర్ 19 భారత జట్టు కెప్టెన్ గా, జాతీయ సీనియర్ జట్టుకు మేనేజర్ గా పనిచేశారు. బిస్వాల్ 1987-1996 మధ్య కాలంలో ఒడిశా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.

Exit mobile version