పంజాబ్ ఆశలు సజీవం !

ipl-punjabకింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఐపీఎల్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ధర్మాశాలలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ లలో మిల్లర్ 44 నాటౌట్, గిల్ క్రిస్ట్ 42 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ.. 7 వికెట్లకు 164 పరుగులే చేయగలిగింది. రోరర్ ఒక్క 49 చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.