నవంబర్ 18న హైదరాబాద్ లో తపాలా పెన్షన్ అదాలత్

తపాలా పెన్షనర్స్ కి  సంబంధించి ప్రజల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకొనేందుకు 2020  నవంబర్ 18న ఉదయం 11.00 గంటల కు హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో గల  డాక్  సదన్ లో ‘పెన్షన్ అదాలత్’ ను నిర్వహించనున్నట్లు  అసిస్టె౦ట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ రజనీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టల్ పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్ల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన ఫిర్యాదులను   తపాలా విభాగం లోని ద డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ (తపాలా)డాక్ సదన్హైదరాబాద్- 500001,   చిరునామా కు కవర్ పైన  ‘‘పోస్టల్ పెన్షన్ అదాలత్ ఆఫ్ తెలంగాణ సర్కిల్’’  అనే పదాలు రాసి  తపాలా కవర్ లో 2020 నవంబర్ 11వ తేదీ లోపు తెలియజేయవచ్చు.  వ్యక్తిగత పెన్షనర్లు/ కుటుంబ పెన్షనర్లు ప్రాంతీయ/డివిజనల్ స్థాయి పెన్షన్ అదాలత్ వద్ద తీసుకున్న కేసు యొక్క వాస్తవాలను సక్రమంగా అందించాలి మరియు ప్రాంతీయ/డివిజన్ స్థాయి ఇచ్చిన ఏదైనా ప్రత్యుత్తరం కాపీ ఉంటే, పెన్షన్ అదాలత్ కి సమర్పి౦చాలి.  నిర్ణీత తేదీ తర్వాత అందుకున్న అభ్యర్థనలు పరిగణలోకి తీసుకొనబడవు. దరఖాస్తుదారులు కావాలనుకుంటే వ్యక్తిగతంగా అదాలత్‌కు హాజరుకావచ్చు.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం