ప్రభుత్వం పట్టించుకోలేదు..కానీ పవన్ ఆదుకున్నాడు.

pawan-on-munikoti-deathమాట ఇచ్చిన రాజకీయనాయకులు మాట తప్పారు..ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం అటుగానే వెళ్ళిపోయింది. తోటి మనుషులైన జాలి చూపిస్తారంటే అది లేకుండా పోయింది..కానీ సాటి మనిషి ఆపదలో ఉన్నాడంటే ఎక్కడికయినా , ఎంతకయినా తెగించే నిజమైన నాయకుడు మానవతావాది పవన్ కళ్యాణ్ అని మరోసారి రుజువయ్యింది.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాదనే బాధతో చిత్తూరు జిల్లా తిరుపతి కి చెందిన మునుకోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని నేటికీ ఏడాది గడుస్తుంది. కుటుంబానికి ఆసరా అనుకున్న వ్యక్తి చనిపోవడం తో ఆ కుటుంబం రోడ్ న పడింది. ఆదుకొంటామన్న ప్రభుత్వం ఏవిధమైన సాయం చేయలేదు. దీంతో గత కొన్ని రోజులుగా మునుకోటి ఫై వార్తలు సోషల్ మీడియా లో విపరీతంగా చక్కర్లు కొట్టడం తో ఈ వార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ముని కోటి కుటుంబానికి తన సన్నిహితుడైన మరిశెట్టి రాఘవయ్య ను పంపి ఐదు లక్షల ఆర్ధిక సాయం అందజేశాడు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఇప్పటికీనా రాజకీయనాయకులూ తమ స్వార్ద రాజకీయాలకోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దేవుడు అనడానికి , మీము భక్తులం అనడానికి ఇంకెన్ని ఉదాహరణలు కావాలి..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.