Site icon TeluguMirchi.com

నిర్భయ అంత్యక్రియలు పూర్తి

Presentation1ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నిర్భయ అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఢిల్లీలో నిర్వహించారు. నిర్భయ మృతదేహాన్ని సింగపూర్‌ నుంచి ఢిల్లీకి తరలించిన కొద్ది గంటల్లోనే అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఢిల్లీలో ఉంచాలని డిమాండ్ చేసినప్పటికీ, భద్రతా కారణాల రీత్యా ఉదయం 7.35 గంటలకే అత్యక్రియలు ముగించారు. ద్వారకా సెక్టర్ 24 శ్మశానవాటికలో అధికార లాంచనాలతో అత్యక్రియలు జరిగాయి. అత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్ సింగ్, కేజ్రీవాల్ హాజరయ్యారు.  అంత్యక్రియలకు మీడియాను అనుమతించలేదు.

Exit mobile version