Site icon TeluguMirchi.com

సెమీస్ లో ఫస్ట్ బ్యాటింగ్ కివీస్ దే…!

వరల్డ్ కప్ లో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టాస్‌ ఓడిపోయాడు. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ గ్రౌండ్ మాత్రం టీమిండియాకి కలిసొచ్చిన మైదానంగా చెప్పుకోవాలి. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువ సార్లు విజయం సాధించాయి.

ఈ మ్యాచ్ లో భార‌త్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. కుల్దీప్ స్థానంలో చాహ‌ల్ జ‌ట్టులో ప్లేస్ దక్కగా .న్యూజిలాండ్ కూడా ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. సౌథీ స్థానంలో ఫెర్గూస‌న్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

భారత్‌: లోకేశ్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌పంత్‌, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్ టేలర్‌, టామ్‌ లేథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, లాకీ ఫెర్గూసన్‌, మాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌

Exit mobile version