వరల్డ్ కప్ లో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి సెమీస్ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ మాత్రం టీమిండియాకి కలిసొచ్చిన మైదానంగా చెప్పుకోవాలి. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు విజయం సాధించాయి.
ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్ స్థానంలో చాహల్ జట్టులో ప్లేస్ దక్కగా .న్యూజిలాండ్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సౌథీ స్థానంలో ఫెర్గూసన్ జట్టులోకి వచ్చాడు.
భారత్: లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్పంత్, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, హార్దిక్పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లేథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డి గ్రాండ్హోమ్, మిచెల్ శాంట్నర్, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్