Site icon TeluguMirchi.com

హైకోర్టు సీజేగా సేన్ గుప్తా

Justice Kalyan Jyoti Senguptaహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సేన్ గుప్తాకు సీఎం కిరణ్ అభినందనలు తెలిపారు.

వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కేజే సేన్ గుప్తా 1953 మే 7న జన్మించారు. న్యాయవిద్య పూర్తి చేసిన అనంతరం 1981 ఏప్రిల్ 21న న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి క్రిమినల్, సివిల్, రాజ్యాంగ అంశాలకు చెందిన కేసులపై కోల్‌కత్తా హైకోర్టులో పలు కేసులు వాదించారు. 1997 జూలై 17న కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన ఆయన… అనేక సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2012 అక్టోబర్‌లో కొద్ది కాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించారు.

Exit mobile version