గత కొన్ని వారాలుగా ముజఫర్ నగర్ లో ఈవ్ టీజింగ్ కార్యకలాపాలు పెరిగిపోయాయి. వీటిని అడ్డుకునేందుకు ఒక మతం వర్గం వారు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. ఇందులో కొందరు వ్యక్తులు ముజఫర్ నగర్ శివారు గ్రామస్థులతో ఘర్షణకు దిగారు. అనంతరం ఈ గ్రూప్ పట్టణంలోకి రాగా వీరిపై దాడి జరిగింది. ఇదే అల్లర్లకు దారి తీసింది.