ముజఫర్ నగర్ అల్లర్లు..11మంది మృతి

muzaffarnagar_violenceఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో ఇరు మత వర్గాల మధ్య శనివారం జరిగిన తీవ్ర ఘర్షణల్లో 11 మంది మృతి చెందారు. నిన్న 9 మంది మృతి చెందగా, 34 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తుండగా ఈ ఉదయం మరో ఇద్దరు ప్రాణం విడిచారు. దీంతో మృతుల సంఖ్యా 11 కు చేరింది.

గత కొన్ని వారాలుగా ముజఫర్ నగర్ లో ఈవ్ టీజింగ్ కార్యకలాపాలు పెరిగిపోయాయి. వీటిని అడ్డుకునేందుకు ఒక మతం వర్గం వారు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. ఇందులో కొందరు వ్యక్తులు ముజఫర్ నగర్ శివారు గ్రామస్థులతో ఘర్షణకు దిగారు. అనంతరం ఈ గ్రూప్ పట్టణంలోకి రాగా వీరిపై దాడి జరిగింది. ఇదే అల్లర్లకు దారి తీసింది.