ఫైనల్లో ముంబయి !

mumbai-in-finalఐపీఎల్-6 పోరు రసవత్తరంగా మారుతోంది. క్వాలిఫైయర్-I లో చెన్నై చేతిలో ఓడిన ముంబయికి ఫైనల్లో ప్రతికారం తీర్చుకునే అవకాశం వచ్చింది. చివరి ఓవర్ దాకా నువ్వానేనా అన్నట్లు సాగిన క్వాలిఫైయర్-2 లో ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. మొదటి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ లలో ద్రవిడ్43, యాజ్ఞిక్ 31 (నాటౌట్ ) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబయి మరో బంతి మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. స్మిత్ 62 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హర్బజన్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫైనల్ ముంబయి, చెన్నై జట్ల మధ్య అదివారం కోల్ కత ఈడెన్ గార్డెన్ లో జరగనుంది.