Site icon TeluguMirchi.com

ముంభైలో భారీ అగ్ని ప్రమాదం – 7గురు మృతి

Mumbai-fire-accidentముంభైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబయిలోని కాంప్స్ కార్నర్స్ అపార్ట్ మెంట్ లో 12వ అంతస్థులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలపాలైనారు. గత రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.

Exit mobile version