Site icon TeluguMirchi.com

పట్టాలు తప్పిన మంగళ ఎక్స్‌ప్రెస్ – 5గురు మృతి !

mangala express accidentమహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఘోటి దగ్గర మంగళ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో.. పోలీసులు దగ్గరలో ఉన్న రూరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎర్నాకుళం నుంచి
నిజాముద్దీన్ వెళ్తున్న మంగళ ఎక్స్‌ప్రెస్ దాదాపు ఆరుబోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.

Exit mobile version