Site icon TeluguMirchi.com

చివరి టెలిగ్రామ్ ‘యువరాజు’కే..!

Rahul63 ఏళ్లు చరిత్ర గల టెలిగ్రామ్ జీవితం నిన్నటితో ముగిసిపోయింది. చివరి టెలిగ్రామ్.. దేశ రాజధానిలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకే వెళ్లడంవిశేషం. జనపథ్ లోని సెంట్రల్ టెలిగ్రామ్ ఆఫీసు నుంచి అశ్విని మిశ్రా దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ ఎస్ఎం ఖాన్ కు, అనంతరం రాహుల్ కు టెలిగ్రామ్ పంపించారు. ఈ విషయాన్ని సంబంధిత కేంద్రం సిబ్బంది వెల్లడించారు. అయితే, టెలిగ్రాం సేవలు నిన్న రాత్రి 9 గంటలతో ముగిసిపోవాల్సి ఉండగా, ప్రజలనుండి స్పందన అధికంగా ఉండడంతో జనపథ్ లోని టెలిగ్రామ్ కార్యాలయం అర్థరాత్రి 11.45 వరకూ తెరిచే ఉంచారు.

Exit mobile version