Site icon TeluguMirchi.com

కరోనా వ్యాప్తి నిరోధానికి జూబ్లీహిల్స్ సొసైటీ కోటిన్నర విరాళం


కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఇందులో జూబ్లీహిల్స్ సొసైటీ కోటి రూపాయలు అందించగా జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ 50 లక్షల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కులను సొసైటీ అధ్యక్షుడు తుమ్మల నరేంద్ర చౌదరి, కార్యదర్శి టి హనుమంతరావు తదితరులు ఇవాళ సీఎం కేసీఆర్ కు చెక్ అందించారు. కష్ట కాలంలో అండగా నిలుస్తున్న వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version