ఒలింపిక్స్ లో భారత్ కు లైన్ క్లియర్

olympic Line clearగత ఐదు నెలలుగా నిషేదం ఎదుర్కొంటున్న భారత ఒలింపిక్ అసోసియేషన్ కష్టాలు తీరిపోయాయి. భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) పై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేదం ఎత్తివేసినట్టు భారత క్రీడాశాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ లూసానా నగరంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయని, ఒలింపిక్స్ లో భారత్ రీ ఎంట్రీకి అడ్డంకులు తొలగిపోయాయని అధికారులు తెలిపారు. గతంలో ఒలింపిక్ ఛార్టర్ కు ఐఓఏ కట్టుబడి లేదన్న కారణంగా సస్పెండ్ చేసిన ఐఓసీ నిబంధలను ఒప్పుకుని పాటిస్తామని భారత ఒలింపిక్ అసోసియేషన్ హామీ ఇవ్వడంతో నిషేదాన్ని ఎత్తివేసేందుకు అంగీకరించింది.