సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

సఫారీ గడ్డపై భారత్ సత్తా చాటింది.టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరిస్ ను కైవసం చేసుకుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో దక్షినాఫ్రికా జట్టును 73పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఒక వన్డే మిగులుండగానే సిరిస్ ను సొంతం చేసుకుంది భారత్.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. 300పరుగులు సులువుగా చెస్తుందనుకున్న జట్టు 274 పరుగులతో సరిపెట్టుకుంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (115 )తో పాటు ధావన్‌, కోహ్లీ, శ్రేయస్‌ రాణించడంతో 274 పరుగులు చేసింది.

275పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. ఆదిలోనే వికెట్లు చేజార్చుకుంది. ఆమ్లా ఒక్కడే 77పరుగులతో రాణించాడు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.