Site icon TeluguMirchi.com

వరుణుడు కనికరిస్తాడా ?

దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య రెండో టీ20 జరగడం కష్టమే అనిపిస్తోంది. రాత్రి 9:45 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ ఆలస్యం కావొచ్చు. లేదంటే పూర్తిగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌ నిర్వహించాల్సిన సెంచూరియన్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ మైదానంలో భారీ వర్షం కురుస్తోంది.

మరోవైపు దక్షిణాఫ్రికా-భారత్‌ మహిళల మధ్య జరుగుతున్న నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. వర్షం కారణంగా అవుట్‌ ఫీల్డ్‌ పచ్చిగా ఉండడం, మరి కొద్ది గంటల్లో పురుషుల మ్యాచ్‌ ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో హర్మన్‌ ప్రీత్‌ సేన నిర్ణయాత్మక ఐదో టీ20 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు చివరి మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ వశం అవుతోంది

Exit mobile version