Site icon TeluguMirchi.com

టీం ఇండియా ఘోర పరాజయం

indiaభారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్‌ చిత్తుగా ఓడింది. సఫారీల చేతిలో 134 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. సఫారీ పేసర్ల దాటికి భారత ఆటగాళ్లు విలవిలలాడారు. దీంతో మూడు వన్డేల సీరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా 2-0తో ఎగరేసుకుపోయింది. భారత జట్టులో రైనా 36, జడేజా 26, రోహిత్ శర్మ 19, ధోనీ 19 పరుగులు చేయగా, మిగిలిన ఆటగాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు. ఇక సిరిస్ లో ఆఖరి నామమాత్రపు వన్డే బుధవారం జరగనుంది.

Exit mobile version