న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం సాధించాలంటే 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొన్న ధోనీకి… భారత బౌలర్లు మంచి ఆరంభాన్నేఇచ్చారు. ఓపెనర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా… టేలర్ (55), విలయమ్సన్ (71) రాణించడంతో కోలుకొంది. చివర్లో మెరుపు వీరుడు పీటర్సన్ (40 బంతుల్లో 68 నాటౌట్) విజృంభించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. భారత బౌలర్లలో సమి ( 4 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ రాణించారు. ఇషాంత్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. తొమ్మిది ఓవర్లలో 72 పరుగులిచ్చాడు.