Site icon TeluguMirchi.com

టీమిండియా అదుర్స్.. సఫారీ జట్టు బెదుర్స్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత సఫారీలను బ్యాట్ తో అదరగొట్టిన ఇండియా.. అటు బౌలింగ్‌లో కూడా రాణించి అద్బుతమైన విజయాన్ని అందుకుంది. 28పరుగుల తేడాతో గెలుపొందింది. 204 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 9 వికెట్ల నష్టానికి 175 పరుగులతో సరిపెట్టుకున్నారు.
భారత్ స్కోరు: 203/5
భారత్ బ్యాటింగ్ : ధావన్ 72, పాండే 29, కోహ్లి 26, రోహిత్ 21 పరుగులు
దక్షిణాఫ్రికా బౌలింగ్ : డాలా 2, మోరిస్, షమ్సీ, పెహ్లుక్వాయోకు తలో వికెట్
దక్షిణాఫ్రికా స్కోరు: 175/9
దక్షిణాఫ్రికా బ్యాటింగ్: హెండ్రిక్స్ 70, బెహర్డీన్ 39, క్లాసెన్ 16 పరుగులు
భారత్ బౌలింగ్ : భువనేశ్వర్ 5, పాండ్య, చాహల్, ఉనద్కత్‌కు తలో వికెట్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : భువనేశ్వర్ కుమార్ (5 వికెట్లు)

ఈ విజయంతో భారత్‌ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ బుధవారం జరుగనుంది.

Exit mobile version