ముక్కోణపు టీ20 సిరీస్లో భారత్ ఫైనల్ బెర్త్ దాదాపు ఖారరైయింది. వరుసగా రెండో విజయం సాధించిన భారత్.. ఫైనల్ అవకాశాల్ని మరింత మెరుగుపరుచుకుంది. తొలి మ్యాచ్లో లంకపై ఓడిన భారత్ నిన్న విజయం సాధించింది.
నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం వల్ల 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో మొదట లంకను 152/9కు కట్టడి చేసిన భారత్.. లక్ష్యాన్ని ఇంకో 9 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శార్దూల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. బుధవారం భారత్ తన చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే ఫైనల్ బెర్తు ఖరారవుతుంది.