లంకపై రివెంజ్ విక్టరీ

ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌ బెర్త్ దాదాపు ఖారరైయింది. వరుసగా రెండో విజయం సాధించిన భారత్‌.. ఫైనల్‌ అవకాశాల్ని మరింత మెరుగుపరుచుకుంది. తొలి మ్యాచ్‌లో లంకపై ఓడిన భారత్ నిన్న విజయం సాధించింది.

నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం వల్ల 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట లంకను 152/9కు కట్టడి చేసిన భారత్‌.. లక్ష్యాన్ని ఇంకో 9 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శార్దూల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. బుధవారం భారత్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌ బెర్తు ఖరారవుతుంది.