Site icon TeluguMirchi.com

బంగ్లాపై భారత్ విజయం

ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ బోణీ చేసింది. భార‌త్, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య కొలంబోలో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో భారత్ విజయ సాదించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో తమిమ్ ఇక్బల్ 15, సౌమ్య సర్కార్ 14, లిటోన్ దాస్ 34, రహీమ్ 18, మహ్మదుల్లా 1, షబ్బీర్ రెహ్మాన్ 30, మెహిదీ మాసన్ 3, టాస్కిన్ అహ్మద్ 8, రుబెల్ హాసన్ 0, ముస్తాఫిజర్ రహ్మాన్ 1 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జయ్‌దేవ్ మూడు వికెట్లు తీయగా, విజయ్ శంకర్ 2, శార్దూల్ ఠాకూర్, ఛాహెల్ తలో వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ 55(43బంతుల్లో) అర్ధశతకం, సురేశ్‌ రైనా 28(27బంతుల్లో) మనీశ్‌ పాండే 27(19బంతుల్లో) నిలకడగా ఆడి బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించారు.

Exit mobile version