టెస్టు సిరీస్ చేజారిన కసితో ఆడిన భారత్.. వన్డే సిరీస్ను టీమ్ఇండియా ఘనంగా ఆరంభించింది. అన్ని రంగాల్లోనూ ఆతిథ్య జట్టుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతితో కట్టిపడేసి.. బ్యాటుతో చెలరేగిపోయిన భారత్ జట్టు సఫారీలను కసి తీరా ఓడించింది. తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్ ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది.
కెప్టెన్ కోహ్లి (112) రహానె (79) అదరగొట్టడంతో నిన్న తొలి వన్డేలో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. మొదట స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/34), చాహల్ (2/45) మాయ చేయడంతో దక్షిణాఫ్రికాను భారత్ 269/8కి కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై 17 వన్డేల తర్వాత దక్షిణాఫ్రికాకు ఇదే తొలి ఓటమి కావడం విశేషం.