క్కోణపు టీ20 సిరీస్ కోసం బయలుదేరిన రోహిత్ శర్మ సేన కొలంబో చేరుకుంది. భారత్-బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మంగళవారం నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీమిండియా బయలుదేరిన సంగతి తెలిసిందే.
కాగా ఆరుగురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో యువ క్రికెటర్లకు ఇది చక్కని అవకాశమే. రోహిత్ శర్మ నేతృత్వంలో రాణించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కలలు కంటున్నారు. దక్షిణాఫ్రికాలో విజయ దుందుభి మోగించిన టీమిండియా ఈ సిరిస్ కు మాత్రం అంతా యువ టీంను పంపింది. మంగళవారం రాత్రి 7 గంటలకు భారత్, శ్రీలంక మధ్య తొలి పోరు జరగనుంది.