భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కోహ్లీసేన ముందు 270 పరుగుల లక్ష్యం ఉంచింది. ఒకదేశంలో 134/5తో కష్టాల్లో పడ్డ ఆ జట్టును డుప్లెసిస్ (120) ఆదుకున్నాడు. అద్భుత శతకం సాధించి కోహ్లీసేన ముందు 270 పరుగుల లక్ష్యం నిలిపాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడింది. ఐతే వరుసగా మార్ర్కమ్ (9), డుమిని (12), డేవిడ్ మిల్లర్ (7)ను కుల్దీప్, చాహల్ వరుసగా ఔట్ చేయడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో డుప్లెసిస్ అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు.
కాగా ఈ మ్యాచ్లో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/34), యజువేంద్ర చాహల్ (2/45) చెలరేగారు.