ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఆసీస్ ను కట్టడి చేసింది. భారత్ బౌలర్లు సత్తా చాటారు. కీలక ఫైనల్ లో ఆభారత్ టాస్ ఓడి ఫీల్డింగ్కు దిగింది .అయితే భారత్ బౌలర్లు ఆసీస్ బ్యా్ట్స్మెన్లపై విరుచుకుపడ్డారు.
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు శుభారంభం దక్కలేదు. 32 పరుగుల వద్ద ఇషాన్ పోరెల్ బౌలింగ్లో ఓపెనర్ బ్రయంత్ (14).. అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సంఘా(13) కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలువలేదు. అంతకు ముందే పోరెల్ బౌలింగ్లోనే మరో ఓపెనర్ ఎడ్వర్ట్స్(28).. నాగర్కోటికి క్యాచ్ ఇచ్చాడు. ఇలా వరుస వికెట్లు పడగొట్టిన భారత్ 47.2లో ఓవర్లలో 216 పరుగుకే ఆసీస్ ను కుప్ప కుప్ప కూలింది. ఇప్పడు మన కుర్రాళ్లు ప్రపంచకప్ కైవసం చేసుకోవాలంటే ఇక చేయాల్సిన పరుగులు 217 మాత్రమే.