అండర్-19 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత యువ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ప్రధాన నరేంద్ర మోదీ దగ్గరి నుంచి మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, సినీ తారలు భారత యువ జట్టు పై మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.
అలాగే విశ్వ విజేతగా నిలిచిన భారత యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ.30 లక్షలు, కోచ్ రాహుల్ ద్రవిడ్కు రూ.50లక్షలు, సహాయ సిబ్బందిలోని ఒక్కొక్కరికి రూ.20లక్షలు అందిస్తున్నట్లు బీసీసీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది.