Site icon TeluguMirchi.com

సైనా@ రూ.71 లక్షలు..మరి జ్వాలా సంగతేంటి!

saina jwalaఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ వేలం జోరుగా సాగింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) వేలంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ను హైదరాబాద్ హాట్ షాట్స్ స్వంతం చేసుకుంది. ఆమెకు వేలంలో రూ.71 లక్షల ధర లభించింది. ఇక ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు లీ ఛాంగ్ వీకి రూ.80 లక్షల ధర పలికింది. ముంబై మాస్టర్స్ జట్టు ఆమెను కొనుగోలు చేసింది. ఇక రాష్ట్రానికి చెందిన పారుపల్లి కశ్యప్ 44.50 లక్షలు పలికాడు. కశ్యప్ ఇక బంగా బీట్స్ జట్టుకు ఆడనున్నాడు. ఐబీఎల్ టోర్నమెంటు ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జరగనుంది. కాగా ఈ ఇటివలే ముఖానికి మేకప్ వేసుక్కున్న జ్వాలా గుత్తా కు రూ.18 లక్షలు చెల్లించి ఢిల్లీ స్మాషర్స్ సొంతం చేసుకొంది.

Exit mobile version