Site icon TeluguMirchi.com

ప్రమాద స్థాయికి హుస్సేన్ సాగర్ నీటిమట్టం

Hussain-Sagar-water-to-the-హుస్సేన్ సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయికి చేరింది. గత రెండు రోజులుగా నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్నవర్షాలతో హుస్సేన్సాగర్ నీటిమట్టం భారీగా పెరుగింది. దీంతో.. లోయర్ ట్యాంక్ బండ్ లో గల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకా హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరిగితే.. సమీపంలోని అరుంధతి నగర్, రత్నానగర్, దోమల్ గూడ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాలు నీటితో మునిగిపోయే ప్రమాదం వుంది. సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version