బీసీసీఐ చీఫ్ అల్లుడు ఇంట్లో సోదాలు !

ipl-spot-fixingబీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ గురునాథ్ మెయ్యప్పన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో గురునాథ్ పై వచ్చిన ఆరోపణల్లో భాగంగానే ఆయనను విచారించడానికి ముంబాయి పోలీసులు చైన్నైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, గురునాథ్ అందుబాటులో లేకపోవడంతో.. పోలీసులు ఆయనను విచారించడానికి సమన్లు జారీచేసి వెళ్లిపోయినట్లు సమాచారం. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో.. కొద్దిరోజుల క్రితం అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ పోలీసుల విచారణలో గురునాథ్ పేరు బయటపెట్టిన సంగతి తెలిసిందే.