Site icon TeluguMirchi.com

ఎన్డీయే వద్ద ఎదురు కాల్పులు

పూణేలోని ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీయే) లో చొరబడేందుకు ఐదుగురు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారు జామును భద్రతా దళాలు గస్తీ తిరుగుతుండగా.. అకాడమీలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న నలుగురైదుగురు వ్యక్తులను భద్రతా దళాలు అక్కడే ఆగమని హెచ్చరించారు. దీంతో.. అగంతకులు కాల్పులకు ఎగబ్బాడ్డారు. వెంటనే అప్రమత్తమయిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో.. వారిలో ఒకరు
మరణించగా, మిగిలిన వారు తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే ఉత్తమ సంస్థల్లో ఒకటయిన ఎన్డీయే వద్ద ఇటువంటి ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Exit mobile version