కుప్పకూలిన సిటీలైట్ భవనం !

citylight-hotelసికింద్రాబాద్ లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రపతి రోడ్ లోని సిటీలైట్ హోటల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువ్రు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న జీహెచ్ ఎంసీ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం సహాయక చర్యలను అందిస్తున్నారు. అయితే, సికింద్రాబాద్ లో గల ఈ హోటల్ భవనం చాలా పురాతనమైనది. అందువలనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం …జీహెచ్ ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.