మెరుగైన పరిపాలన కోసం ఓటు వేయండి

banvar lal
రాష్ట్రంలో జరిగే తొలి విడత పోలింగ్ కు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని , మెరుగైన పరిపాలన కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ కోరారు. తెలంగాణలో పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రైవేటు సంస్థలు అవకాశం ఇవ్వాలని భన్వర్ లాల్ కోరారు. 24 గంటలూ పనిచేసే కర్మాగారాలు, కాల్ సెంటర్ యాజమాన్యాలు తప్పనిసరిగా ఒక షిఫ్ట్ లో సెలవు ప్రకటించాలని ఆయన చెప్పారు. ప్రైవేటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.