19న బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర భేటీ !

bcci-emergency-meetingఐపీఎల్ -6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్థాన్ క్రికెటర్స్ అరెస్టయిన నేపథ్యంలో.. బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈనెల 19 అత్యసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో క్రీడాలోకాన్ని ఒక్క కుదుపు కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అంశంపై చర్చించనున్నారు. కాగా, ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలో రాజస్థాన్ క్రీడాకారులు శ్రీశాంత్, చవాన్, అజిత్ చండిలాను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.