అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 26.4 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలి రెండో తక్కువ స్కోర్ నమోదు చేసింది. స్టార్క్ (22), దొహెర్తీ(15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. లంక బౌలర్లలో కులశేఖర 5, మలింగ 3 వికెట్లు నేలకూల్చారు. మాథ్యూస్, ఇరంగ చెరో వికెట్ దక్కించుకున్నారు. కులశేఖర ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. ఈ విజయంలో 5 వన్డేల సిరీస్లో శ్రీలంక 2-1 ఆధిక్యం సాధించింది. ఇంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో 70 పరుగులే అలౌటయిన విషయం తెలిసిందే.