‘అర్జున’ అవార్డు అందుకున్న రైజింగ్‌ రాకెట్‌

sindhuఅంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతున్న రైజింగ్‌ రాకెట్‌, హైదరాబాదీ ఆశా కిరణం పుసర్ల వెంకట సింధు ‘అర్జున’ అవార్డు స్వీకరించింది. ఆగస్టు 31న ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవాల్సి ఉన్నా.. బిజీ షెడ్యూల్ కారణంగా సింధుకు కుదరలేదు. ఈ నేపధ్యంలో నిన్న సాయంత్రం ఢిల్లీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకుంది. ‘అర్జున’ పురస్కారం కింద సింధుకు ఓ జ్ఞాపికతో పాటు రూ.5 లక్షల నగదు అందించారు.