ఏపీపీఎస్సీ సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్త ఛైర్మెన్ ఎంపిక ఉత్కంఠ కలిగించింది. రేచల్ ఛటర్జీ స్థానంలో ఛైర్మెన్ ఎంపిక కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూ సహా పలువురు అధికారుల పేర్లను పరిశీలించారు. మిన్నీ మాథ్యూను సీఎన్ గా కొనసాగించే అవకాశం ఉండడంతో ఏపీపీఎస్సీకి మరొకరిని నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. మిన్నీ సహా ఇతర అభ్యర్థుల పేర్లను పరిశీలించాక చివరికి బిస్వాల్ వైపు మొగ్గుచూపారు. ఒడిశాకు చెందిన బిస్వాల్ 1981 బ్యాచ్ అధికారి. రాష్ర్ట్టేతర అధికారి నియామకమే మేలన్న ఉద్దేశంతో బిస్వాల్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.